హైదరాబాద్ : లోయర్ మానేరు నది సుందరీకరణ, పటిష్ట పనుల నిర్వహణ కోసం ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ. 310.464 కోట్లు విడుదల చేస్తూ జారీ చేసింది. ఈ జీఓ కాపీని సీఎం కేసీఆర్ స్వయంగా మంత్రి గంగుల కమలాకర్కు శుక్రవారం ప్రగతి భవన్లో అందజేశారు. నిర్మాణ పనుల డీపీఆర్ తయారీకి టెండర్ ఖరారు కోసం విధివిధానాలను రూపొందించేందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రి గంగుల కమలాకర్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో జూన్ 12న సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాగా మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో భాగంగా రూ. 80 కోట్ల వ్యయంతో చెక్ డ్యాంల నిర్మాణం, రూ.190 కోట్లతో కేబుల్ బ్రిడ్జీ నిర్మాణ పనులు ఇప్పటికే చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.