రాంచీ: కరోనా మహమ్మారి విస్తరణ కారణంగా స్వస్థలాలకు వెళ్లిన వలసకార్మికులు తిరిగి వచ్చేటప్పుడు అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామని జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జార్ఖండ్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఒక ప్రకటన చేశారు. అయితే, కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారిని ఏడు రోజులపాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచుతామని చెప్పారు.
ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం జార్ఖండ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రొటోకాల్ ప్రకారం చర్యలు చేపడుతామని జార్ఖండ్ చీఫ్ సెక్రెటరీ వెల్లడించారు.