ముంబై: భారత మాజీ కెప్టెన్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ సంపాదన ప్రతిఏడాది కోట్లలో ఉంటుంది. ఓవైపు క్రికెట్ ఆడుతూనే వివిధ రంగాల్లో ధోనీ పెట్టుబడులు పెట్టాడు. వినోద రంగంలోనూ మహీ అడుగుపెట్టాడు. ముంబైలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ధోనీ ఎంస్ఎడీ ఎంటర్టైన్మెంట్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించాడు.
పుణెలోని పింప్రి-చిన్చ్వాడ్లో ఇటీవల ధోనీ కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు. పుణెలో రియల్ ఎస్టేట్కు మంచి డిమాండ్ ఉండటంతో రావేట్లోని ఎస్టాడో ప్రెసిడెన్షియల్ సొసైటీలో ఖరీదైన ఇళ్లు కొన్నట్లు తెలుస్తోంది.
కొద్దిరోజుల క్రితం అతని భార్య సాక్షి సింగ్ ముంబైలో నిర్మాణంలో కొత్త ఇంటి ఫొటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్ధంతరంగా ఆగిపోవడంతో ధోనీ ప్రస్తుతం రాంచీలోని తన ఇంట్లో ఉంటున్నాడు.