టోక్యో: ఒలింపిక్స్ నిర్వహణకు ఇంకా 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జపాన్ ప్రజలంతా ఒలింపిక్స్ను బహిష్కరించాలని కోరుతుండగా.. ప్రభుత్వం మాత్రం మొండిపట్టుదలతో ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటగాళ్లు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ప్రజలకు మద్దతుగా నిలిచారు.
టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, నవోమి ఒసాకా, జపాన్కు చెందిన కెయి నిషికోరి ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ టోర్నమెంట్ గురించి ప్రశ్నలు సంధించారు. ఈ టోర్నమెంట్లో దాదాపు 10,000 మంది అథ్లెట్లు, సిబ్బంది హాజరవుతారని, వీరందరికీ బయో బబుల్ నిర్వహణ అంత సులభం కాదని వారు వాదిస్తున్నారు.
జపాన్లో గత 10 రోజుల్లో 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, స్థానిక నిర్వాహకులు ఈ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహిస్తారనే నమ్మకం తనకు లేదని జపాన్కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నిషికోరి అన్నారు. ఇది వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని, జపాన్లోని అనేక నగరాలు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. ఒలింపిక్స్ నిర్వహించడం సరైనదేనా అనే ప్రశ్న కూడా నిషికోరి లేవనెత్తారు.
కాగా, తన కుమార్తెను వెంట తీసుకురావడానికి సెరెనా విలియమ్స్ అనుమతి కోరక ముందే నిర్వాహకుల తీరును తీవ్రంగా ప్రశ్నించింది. తన మూడేండ్ల కుమార్తెను తీసుకెళ్లడానికి అనుమతించకపోతే టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనేది లేదని సెరెనా కరాఖండిగా తెలిపింది. ‘నా కుమార్తె లేకుండా నేను ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా గడపలేదు. ఈ సమయంలో కుమార్తెను ఒంటరిగా వదిలి రావాలంటే చాలా కష్టం. అయినా కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో బయో బబుల్ ఎలా నిర్వహిస్తారు’ అని ఆమె ప్రశ్నించారు.
ఇలా ఉండగా, ‘అథ్లెట్గా ఖచ్చితంగా ఒలింపిక్ నిర్వహించాలంటున్నాను. జపాన్ పరిస్థితి మరింతగా దిగజారిపోతున్న సమయంలో ఒలింపిక్స్ ఉండాలని నేను అనుకోను. ప్రజలకు దీనితో సమస్య ఉంటే దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి’ అని జపాన్కు చెందిన ఒసాకా చెప్పారు.
ఇలాఉండగా, 60 శాతం మంది జపాన్ ప్రజలు టోర్నమెంట్ను రద్దు చేయాలని కోరుకుంటున్నారు. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి ప్రజలు ఇంత పెద్ద టోర్నమెంట్ జరుగాలని కోరుకోవడం లేదని తేలింది. ఇదే సమయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బేక్ కూడా ఈ వారం తన జపాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా, జపాన్ ప్రభుత్వం మే 31 వరకు అక్కడ అత్యవసర పరిస్థితిని పొడిగించింది.
రష్యాలో పాఠశాలపై కాల్పులు: 13 మంది దుర్మరణం
18 ఏండ్ల పైబడిన వారికి టీకాలు.. ప్రచారాన్ని ప్రారంభించిన తీరత్ సింగ్
బెంగాల్లో హింసను నిరసిస్తూ అమెరికాలో ప్రదర్శనలు
అప్పట్లో అమ్మతో ఇప్పటి బిలియనీర్.. ఎవరో తెలుసా..?
అమెరికా చమురు పైప్లైన్పై సైబర్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
అమెరికా చమురు పైప్లైన్పై సైబర్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..