రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్నప్పటికీ.., రిజిస్ట్రేషన్ల జోరు కొనసాగుతూనే ఉన్నది. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న 22 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా ఏప్రిల్ నెలలో 22,912 రిజిస్ట్రేషన్లు నమోదుకాగా.. రూ.195.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రర్ స్థితప్రజ్ఞ తెలిపారు. ఇందులో స్టాంప్స్ అండ్ డ్యూటీల ద్వారా రూ.136.01 కోట్లు, ట్రాన్స్ఫర్ డ్యూటీల ద్వారా రూ.43.08 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా రూ.16.41కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో రంగారెడ్డి రిజిస్ట్రర్ కార్యాలయం పరిధిలో అత్యధికంగా రూ.61.89 కోట్లు ఆదాయం రాగా.. అత్యల్పంగా కొడంగల్ సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో కేవలం 72 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా రూ.4 లక్షలు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. గండిపేట్లో రూ.34.70కోట్లు, రాజేంద్రనగర్లో రూ.12.77 కోట్లు, శేరిలింగంపల్లిలో రూ.19.70 కోట్లు చొప్పన రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వచ్చింది.