హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు నిర్వహించేందుకు ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)తో వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ-ఏపీ) విశ్వవిద్యాలయం ఎంవోయూ కుదుర్చుకున్నది. శనివారం హైదరాబాద్లోని ఐఐసీటీలో రెండు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఒప్పందం ప్రకారం ఎమ్మెస్సీ, పీహెచ్డీ కోర్సులను నిర్వహిస్తామని, విద్యార్థుల ప్రాజెక్ట్లు, పరిశోధన, ఇంటర్న్షిప్, సీనియర్ డిజైన్ ప్రాజెక్టులకు సహకారం అందిస్తామని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో వీఐటీ ఏపీ వైస్చాన్స్లర్ డాక్టర్ ఎస్వీ కోటారెడ్డి, ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్వీ సత్యనారాయణ, వీఐటీ ఏపీ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సీఎల్వీ శివకుమార్ పాల్గొన్నారు.