హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో గురుకులాల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశానికి నిర్వహించాల్సిన టీఎస్ఆర్జేసీ సెట్ను రద్దుచేస్తున్నట్టు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ గురువారం ప్రకటించింది. ఈసారి గురుకులాల్లో సీట్లను టెన్త్లో విద్యార్థులు సాధించిన గ్రేడ్ల ఆధారంగా భర్తీచేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రవేశాల కోసం గతంలో టీఎస్ఆర్జేసీకి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకే అవకాశం కల్పిస్తారు. ఈ విద్యార్థులు పదో తరగతి గ్రేడ్లకు సంబంధించిన పత్రాలను అప్లోడ్చేసేందుకు ఎడిట్ ఆప్షన్ను ఇచ్చారు. శుక్రవారం నుంచి ఈ నెల 12 వరకు ఆన్లైన్లో వీటిని అప్లోడ్ చేయాలని గురుకుల విద్యాలయాల సంస్థ సూచించింది. పూర్తి వివరాలకు tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని పేర్కొన్నది.