కోదాడ: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న వ్యవసాయ చట్టాలు భవిష్యత్లో అన్నదాతలకు ఉరితాళ్లుగా మారునున్నాయని.. అందుకే అన్నదాతల ప్రతినిధులు తక్షణమే చట్టాలను ఉప సంహరించుకోవాలని నిర్వ హించిన ఉద్యమానికి దేశ వ్యాప్తంగా మద్దతు లభించిందని విప్లవాత్మక సినిమాల దర్శకుడు, నటుడు ఆర్. నారాయణ మూర్తి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తాను రూపొందించిన రైతన్న సినిమాను విజయవంతం చేసేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బొల్లంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ చట్టాలతో రైతులు కూలీలుగా మారడం అనివార్యమన్నారు. కార్పొరేట్ శక్తులకు మోదీ ప్రభుత్వం చట్టాలను అమలు చేసేందుకు కుట్ర ఉందన్నారు. అందుకే తాను ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలపై అవగాహన కలిగించేం దుకు రైతన్న సినిమాను రూపొందించానన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు భాంధవుడు అని ప్రశంశల వర్షం కురిపించాడు. రైతు బంధు, రైతు భీమా రుణా ల మాఫీ, తదితర పథకాలను అమలు చేస్తూ స్వామినాథన్తో కూడా శబాష్ అనిపించుకున్నాడని కొనియా డారు. రాష్టంలో ఆత్మహత్యలు నిర్మూలించిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. రైతు ప్రతినిధులు ఢిల్లీలో నిర్వహించిన ఆందోళనకు దేశ వ్యాప్తంగా మద్దతు లభించిందన్నారు.
అనంతరం ఎమ్మెలే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ రైతన్న సినిమా విజయవంతం కావాలని, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ శక్తులు ఆదాని, అంబానీలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. రైతులను కూలీలుగా మార్చే ఈ చట్టాలను రద్దు చేయాలని నటుడు నారాయణమూర్తి తీసిన సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.
నారాయణమూర్తి ప్రజా చైతన్యం కోసం, పెట్టుబడి, భూస్వామ్య వ్యవస్థల రద్దు కోసం తీసిన విప్లవాత్మక సినిమాలు విజయవంతమై ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయయాన్నారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కమిటీ సభ్యలు ఈదుల కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకులు ఖాజా మొహినుద్దీన్, మామిడి రామారావు తదితరులు పాల్గొన్నారు.