వర్కాల, జూలై 7: కేరళలోని శివగిరి మఠం మాజీ అధిపతి, ప్రఖ్యాత మతగురువు స్వామి ప్రకాశానంద ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీనారాయణ మిషన్ దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 99 ఏండ్లు. ప్రకాశానంద మృతి పట్ల ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేరళ సీఎం విజయన్ సంతాపం ప్రకటించారు. ‘జ్ఞానానికి, ఆధ్యాత్మికతకు ప్రశాకానంద మార్గజ్యోతి’ అని మోదీ కొనియాడారు. ప్రకాశానంద 23 ఏండ్ల వయసులో ‘ఒకే కులం, ఒకే మతం, ఒకే గురువు’ అన్న నారాయణగురు బోధనల పట్ల ఆకర్షితులై శివగిరి మఠంలో చేరారు.