తిరుమల శ్రీవారిని పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, స్వామి వారి కృపతో సరిగ్గా పదేళ్ళ క్రితం టీటీడీ జేఈవోగా భక్తులకు సేవ చేయడం ద్వారా జీవితానికి సార్ధకత చేకూరిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం మెరుగు పడాలని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్ధించినట్లు శ్రీనివాసరాజు తెలిపారు.