న్యూఢిల్లీ: అసోంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని జోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసోంలో ప్రచారానికి సంబంధించి బీజేపీ హైకమాండ్ 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో ఒక జాబితాను రూపొందించింది. అందులో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీనడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, స్మృతి ఇరానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్సింగ్ తదితరులు ఉన్నారు.