హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని ఉపాధ్యక్షులుగా ఏఐసీసీ నియమించింది.
వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జగ్గారెడ్డి, మహ్మద్ అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్కుమార్ యాదవ్, మహేశ్ కుమార్ గౌడ్లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్ రెడ్డి, మల్లు రవి, పొడెం వీరయ్య, సురేశ్ షెట్కార్, వేం నరేందర్ రెడ్డి, రమేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టి. కుమార్ రావు, జావేద్ అమీర్ ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రచార కమిటీ చైర్మన్గా మధు యాష్కీగౌడ్, కన్వీనర్గా సయ్యద్ అజమ్తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా దామోదర రాజ నర్సింహయ్య, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్గా అలేటి మహేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొత్త లేఅవుట్లను అనుమతించొద్దు : సీఎం కేసీఆర్
తెలంగాణలో కొత్తగా 1,028 కరోనా కేసులు
ఈటలపై బీజేపీ నాయకుల సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లు పెంచాలి: వినోద్ కుమార్