ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరిక
పెద్దవూర, ఏప్రిల్ 10: వర్క్లేని కాంగ్రెస్కు వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే రేవంత్రెడ్డికి సీఎం కేసీఆర్ను విమర్శించే స్థాయి లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా పెద్దవూరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రా పాలకులకు చెంచాగా పనిచేసిన ఆయనకు టీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ అనేక పదవులను వదిలిపెట్టినట్టు తెలిపారు. ఉద్యమ సమయంలో రేవంత్రెడ్డి సన్యాసి లెక్క కనిపించకుండాపోయి ఆంధ్రోళ్లకు వత్తాసు పలికి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసినట్టు ఆయన మండిపడ్డారు. హైదరాబాద్లో పెయింటర్గా పనిచేసి రూ.కోట్లు ఎలా సంపాదించావని ప్రశ్నించారు. తీరు మార్చుకోకపోతే మళ్లీ జైల్లో చిప్పకూడు తినడం తప్పదని హెచ్చరించారు.
త్రిపురారం, ఏప్రిల్ 10 : కార్మికుల భవిష్యత్తును మార్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం త్రిపురారంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేవీకే, వెలుగు, రైతుసమాఖ్య సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలేవీ కార్మికులను పట్టించుకోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ అందిస్తూ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేలా చూశామన్నారు.