ముంబై: ఇటలీకి చెందిన టూవీలర్ తయారీ కంపెనీ ‘పియాజియో’ మరో కొత్త స్కూటర్ను భారత్లో విడుదల చేసింది. అప్రిలియా SXR 160 స్కూటర్ను ఆవిష్కరించిన ఐదు నెలల్లోనే అప్రిలియా SXR 125 స్కూటర్ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఎస్ఎక్స్ఆర్ 160 కన్నా దీని ధర 10వేలు తక్కువగా ఉంది. భారత్లో అప్రిలియా SXR 125 స్కూటర్ ధర రూ.1.16లక్షలు( ఎక్స్షోరూం, ఢిల్లీ) గా నిర్ణయించారు.
మాట్ బ్లాక్, వైట్, మాట్ బ్లూ, రెడ్ కలర్లలో అందుబాటులో ఉండొచ్చు. ఎస్ఎక్స్ఆర్ 160 కన్నా అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125లో చిన్న ఇంజిన్ ఉంది. 160లో మాదిరిగా ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా లేదు. దేశంలోని కంపెనీ షోరూంలు, ఆన్లైన్ ద్వారా స్కూటర్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.