న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వం లాక్డౌన్ నుంచి మినహాయింపులు ప్రకటించింది. మూడు వారాల తర్వాత ఢిల్లీలో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యాయి. 50శాతం సీటింగ్ సామర్థ్యంతో మెట్రో నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా లాక్డౌన్తో మే 20 నుంచి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పూర్తిస్థాయిలో సేవలను నిలిపివేసింది. అందుబాటులో ఉన్న రైళ్లలో సగం మాత్రమే నడుస్తాయని డీఎంఆర్సీ అధికారి తెలిపారు. మరో వైపు మాల్స్, మార్కెట్లు, దుకాణాలు సరి-బేసి విధానంలో తెరువనుండగా.. సినిమా థియేటర్లు, రెటస్టారెంట్లు, బార్లు, జిమ్లు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ ఫార్లర్లు మూసే ఉండనున్నాయి.
ప్రైవేటు కార్యాలయాలు సైతం 50శాతం సిబ్బందితో పని చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్ ఏ సిబ్బంది వంద శాతం సామర్థ్యంతో, గ్రూప్-బీలో 50శాతం మంది సిబ్బందితో పని చేయనున్నాయి. ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మే 31న అన్లాక్ ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే.రోజు రోజుకు కేసులు తగ్గుముఖం పడుతుండడంతో గత శనివారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం నుంచి మరిన్ని సడలింపులు ప్రకటించారు.