రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలాశయం వద్ద ఆంక్షలు విధించినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. మానేరు జలాశయం పూర్తి స్థాయిలో నిండి ఉన్నందున ప్రజలు, పర్యాటకులు ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. జలాశయం వద్ద ఫోటోలు, సెల్ఫీల కోసం వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని పేర్కొన్నారు. అలాగే జలాశయం పరిసరాలలో మద్యపానం సేవించరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ రాహుల్ హెగ్డే కోరారు.