మూడ్రోజుల్లోనే 90 మందికి సేవలు
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల కోసం రాష్ట్రవైద్యారోగ్యశాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక హెల్ప్లైన్కు మంచి స్పందన వస్తున్నది. మూడ్రోజుల్లోనే 90 మంది సేవలు పొందినట్టు అధికారులు తెలిపారు. వైద్యారోగ్యశాఖ గతనెల 30న 8639710241 నంబర్తో ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. జర్నలిస్టుల్లో కొవిడ్సోకినవారు, అనుమానాలు ఉన్నవారు ఈ నంబర్కు వాట్సప్ ద్వారా సంప్రదించాలని సూచించారు. ఈ నెల 1 నుంచి సేవలు అందబాటులోకి రాగా.. ఇప్పటివరకు 90 మంది సంప్రదించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువమంది కౌన్సిలింగ్ పొందినట్టు పేర్కొన్నారు. జర్నలిస్టుల హెల్ప్లైన్కు వైద్యారోగ్యశాఖ ప్రత్యేకంగా ఇద్దరు సిబ్బందిని నియమించింది. వారు వాట్సప్లో వచ్చే వినతులను పరిశీలించడం, వారికి అవసరానికి తగినట్టు పడకలు సర్దుబాటు చేయడం, రెమ్డెసివిర్ అందిండచం, టీకాలు వేయించడం, మెడికల్ కిట్లు అందజేయడం, కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి సేవలు అందిస్తున్నారు. రోజుకు సగటున 30 కాల్స్ వస్తున్నాయని అధికారులు తెలిపారు.