హైదరాబాద్ : కరోనా విపత్కర వేళ ప్రభుత్వ వైద్యులకు రాష్ర్ట ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల గౌరవ వేతనాన్ని రూ. 70 వేల నుంచి రూ. 80,500లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు కానున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. దీంతో రెసిడెంట్ డాక్టర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.