హైదరాబాద్ : మానసికంగా ఇబ్బందులుపడేవారు ఆ సమస్య నుంచి బయటపడేందుకు రాచకొండ పోలీసులు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి వారిని పూర్తి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు.
కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సోమవారం ప్రారంభించారు. ఆదివారం మినహా నిత్యం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని సీపీ తెలిపారు. మానసిక సమస్యలతో బాధపడే వారు ఫోన్ నెంబర్ : 040- 48214800లో సంప్రదించాలని ఆయన కోరారు.
ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతోపాటు చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వారికి ఈ సేవలు ఎంతగానో ఉపకరిస్తాయని సీపీ పేర్కొన్నారు. మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారు కౌన్సెలింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.