హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): తమ సమస్యలను పరిష్కరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఈ-పంచాయతీ ఆపరేటర్లు కోరారు. శనివారం ఈ మేరకు బంజారాహిల్స్లో ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రెజరీ ద్వారా వేతనాలు అందించాలని, పీఆర్సీ ప్రకారం కనీస వేతనాన్ని పెంచాలని, పంచాయతీ కార్యదర్శులకు సహాయకులుగా పరిగణించాలని, హెల్త్కార్డులు, ఈఎస్ఐ, పీఎఫ్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.