సీఎస్ సోమేశ్కుమార్కు విన్నవించిన ట్రెసా నేతలు
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలను పరిషరించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞప్తి చేసింది. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్కుమార్ తదితరులు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను కలిశారు. పలు సమస్యలను వివరించి, పరిష్కరించాలని కోరారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పదోన్నతులు కల్పించాలని, అర్హత కలిగిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు సెలక్షన్ గ్రేడ్ ఏర్పాటు చేయాలని, సీసీఎల్ఏ కార్యాలయంలో అర్హత కలిగిన అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్లకు డిప్యూటీ కమీషనర్గా, సూపరింటెండెంట్లకు గ్రేడ్ -1 సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పించాలని, డిప్యూటేషన్పై సీసీఎల్ఏలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. దీర్ఘకాలంగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న తహసీల్దార్లు, ఇతర ఉద్యోగుల విజ్ఞప్తి బదిలీలకు అనుమతి కల్పించాలన్నారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు వీఆర్ఏలకు వెంటనే పేసేల్ వర్తింపజేయాలని విన్నవించారు. దీంతోపాటు పలు సమస్యలను సీఎస్కు వివరించగా, అంశాలవారీగా అమలు చేసేందుకు తగుచర్యలు చేపడుతామని హామీ ఇచ్చినట్టు ట్రెసా నేతలు తెలిపారు.