కుత్బుల్లాపూర్ జోన్ బృందం,జూలై 3: నియోజకవర్గం పరిధిలో పట్ణణ ప్రగతి,హరితహారం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు,అధికారులు వా ర్డుల్లో తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటున్నారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచడంతో పాటు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వివరిస్తున్నారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గాజులరామారం,కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలోని పలు డివిజన్లలో నిర్వహించిన హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డీసీలు మంగతాయారు, రవీంద్రకుమార్, కార్పొరేటర్లతో కలిసి మొక్కలు నాటారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 6,7,8,9,10 వార్డుల్లో నిర్వహించిన పట్టణప్రగతిలో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్ సుంకరికృష్ణవేణికృష్ణతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8,19,20,28 డివిజన్లలో నిర్వహించిన పట్టణప్రగతి కార్యక్రమంలో మేయర్కొలన్ నీలాగోపాల్రెడ్డి,కమిషనర్ గోపి పాల్గొని ప్రజాసమస్యలను అడిగితెలుసుకున్నారు. పలుచోట్ల మొక్కలు నాటారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీలో కార్పొరేటర్ కొలన్ మీనా సునీల్రెడ్డి స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. పారిశుధ్యకార్మికులకు శానిటైజర్లు,మాస్కులు పంపిణీ చేశారు.నాయకులు కొలన్ సునీల్రెడ్డి, కుత్బుల్లాపూర్ ప్రెస్క్లబ్ ప్రెసిడెంట్ వెంకట్, సీనియర్ జర్నలిస్టులు ముక్కర్ల లాలయ్య, జగదీశ్గుప్తా,నాగేంద్రచారి,నర్సింహ, జీతయ్య, రవి, రాము, డివిజన్ ప్రత్యేకాధికారి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
జీడిమెట్ల డివిజన్ అయోధ్యనగర్లో యువనేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపడు కేపీ విశాల్గౌడ్ కాలనీవాసులతో కలిసి మొక్కలు నాటారు. స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో ఎమ్మెల్యే వివేకానంద్, మున్సిపల్ అధికారులు, కాలనీవాసులతో కలిసి మొక్కలు నాటారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12, 5, 6, 4, వార్డుల్లో చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మన్ రాత్లవత్ గంగయ్యనాయక్, కమిషనర్ రఘు, కౌన్సిలర్లు శిరీష, విద్య, సువర్ణలతో పాటు అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలను పంపిణీ చేశారు.
130 సుభాశ్నగర్ డివిజన్ ఫేస్-1లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ కార్పొరేటర్ సురేశ్రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని గిరినగర్, ఆదర్శనగర్, సుమిత్రనగర్లో ఓపెన్నాలాలో పూడికతీత పనులతో పాటు సీసీరోడ్లు, డ్రైనేజీ పనులను కార్పొరేటర్ విజయశేఖర్గౌడ్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. 128 చింతల్ డివిజన్లో కార్పొరేటర్ రషీదాబేగంతో కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మొక్కలు నాటారు.