ఎక్సైజ్ అధికారులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశం
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్శాఖతోపాటు బేవరేజస్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగ ఖాళీలపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ విభాగాల్లోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు ఎక్సైజ్ శాఖకు కేటాయించిన పోస్టుల్లో ఖాళీలపై ఈ సమావేశంలో చర్చించారు. అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు.