‘ప్రైవేటు’ ఫార్మసీల బ్లాక్ మార్కెటింగ్
రాచకొండ పరిధిలో 100 ఇంజెక్షన్లు స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు అమ్ముతూ అంబులెన్స్ డ్రైవర్లు, ప్రైవేటు దవాఖాన సిబ్బంది రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. రూ.3,469కి లభించే ఇంజెక్షన్ను రూ.34 వేలదాకా అమ్ముతూ ప్రాణాలతో బేరాలాడుతున్నారు. రోగులను టార్గెట్ చేసుకొని డిమాండ్ను బట్టిరేటు పెంచుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాలతో బ్లాక్ మార్కెటింగ్ దందాపై ప్రత్యేక నిఘాపెట్టిన పోలీసులు.. 25 మందిని అరెస్టుచేసి, దాదాపు వంద ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకొన్నారు. 20 కేసులు నమోదుచేశారు. మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు 50 రెమిడెసివిర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకొన్నారు. తేలింది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను అధికధరకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకొంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐపీసీ 188, 420 కింద కేసులు నమోదుచేస్తామని. ఎవరైనా బ్లాక్లో అమ్మితే డయల్ 100, పోలీస్ వాట్సాప్నంబర్ 9490617111కు సమాచారమివ్వాలని సూచించారు.
వరంగల్లో 42 ఇంజెక్షన్లు
రెమ్డెసివిర్ ఇంజెక్షన్లతో బ్లాక్ దందా చేస్తున్న ఐదుగురిని వరంగల్ పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి 42 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకొని రూ.1.69 లక్షలను సీజ్ చేశారు. రెమ్డెసివర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న మిర్యాలగూడకు చెందిన బాలకృష్ణ (హెటిరో మేనేజర్), అతడి స్నేహితుడు గణపతిరెడ్డిని అరెస్టు చేసినట్టు అరెస్టు చేసినట్టు నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు.