ల్యాబ్క్యూబ్ ఇమ్యూనిటీ బూస్టర్ విడుదల

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆయుర్వేద మం దుల తయారీ సంస్థ ల్యాబ్క్యూబ్ రూపొందించిన ఇమ్యూనిటీ బూస్టర్ను హైదరాబాద్ అమీర్పేట గ్రీన్పార్క్ హోటల్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శనివారం ఆవిష్కరించారు. కొవిడ్కు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కిషన్రెడ్డి తెలిపారు. కషాయా లు మనలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని చెప్పా రు. ల్యాబ్క్యూబ్ మందులు తయారుచేయడం హర్షణీయమని పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే ఆయుర్వేద మందులతో స్ఫూర్తిపొంది యువత మరిన్ని ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో ల్యాబ్క్యూబ్ డైరెక్టర్ శ్రీనివాస్, కో ఫౌండర్ ఆరోగ్యరాజు పాల్గొన్నారు.
ఏపీలో వ్యాక్సిన్ డ్రై రన్కు ఏర్పాట్లు
కరోనా టీకా పంపిణీ సమయంలో తలెత్తే ఇబ్బందులపై ముందస్తు అవగాహన కోసం డ్రై రన్ చేపట్టాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. కొవిన్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ద్వారా ముందుగా వ్యాక్సిన్ వేయాల్సిన అధికారుల జాబితాను రూపొందించింది. కృష్ణా జిల్లాలో ఎంపికచేసిన ఐదుప్రాంతాల్లో ఈ నెల 28న డ్రై రన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- మార్కెటింగ్ శాఖలో 32 మంది ఉద్యోగులకు పదోన్నతి
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- ఎస్ఈసీకి సీఎస్ ఆదిత్యానాథ్ మూడు పేజీల లేఖ
- కన్న తల్లిని కొట్టి చంపిన తనయుడు
- 24న వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో సీఎం సమీక్ష
- ట్రంప్ వాడే ‘రెడ్ బటన్’ తొలగించిన బైడెన్
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
- ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!