వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 24: ఎండుతెగులును తట్టుకొని నిలిచే నాలుగు కొత్త వరి వంగడాలను మార్కెట్లోకి విడుదల చేసినట్టు భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్ఆర్) డైరెక్టర్ ఆర్ఎమ్ సుందరం తెలిపారు. డీఆర్ఆర్ ధాన్ 53, 54, 55, 56 పేరుతో నూతన వంగడాలను ఆవిష్కరించామని, అందులో డీఆర్ఆర్ ధాన్ 53 ఎండు తెగులును సమర్థంగా తట్టుకొంటుందని ‘నమస్తే తెలంగాణ’కు శనివారం వెల్లడించారు. ఇప్పటివరకు 1,197 అధిక దిగుబడినిచ్చే వంగడాలు, 104 సంకర జాతి వంగడాలను ఐఐఆర్ఆర్ విడుదల చేసిందన్నారు. ఇవేకాకుండా డీఆర్ఆర్ ధాన్ 57, 58, 59, 60, 62 రకాలు సిద్ధ్దంగా ఉన్నాయన్నారు.