న్యూఢిల్లీ: ఫైనాన్స్ బిల్లుపై ఇవాళ లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడారు. విశ్వవ్యాప్తంగా కోవిడ్ వల్ల అన్ని దేశాలపై ఆర్థిక ప్రభావం పడిందని, కేంద్ర ఆర్థిక మంత్రి ఏదైనా ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాయని, ఎలా సపోర్ట్ చేస్తారని వెయిట్ చేశారని, సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన మినహాయింపు తరహాలో 5 లక్షల వరకు జీరో ట్యాక్స్ రిటర్న్స్ ఉంటే బెటర్ అని ఎంపీ నామా తెలిపారు. 5 లక్షల ఆదాయం ఉన్న వారికి రిటర్న్స్ ఫైల్ చేయకుండా మినహాయింపు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం డిస్ప్యూట్ రిజల్యూషన్ స్కీమ్ను ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని, కానీ దానికి టైం లైన్ ఫ్రేమ్ చేయాలన్నారు. పేద వాళ్లకు ఇండ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, మా రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇస్తున్నామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను దేశవ్యాప్తం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
క్వాలిటీ కాటన్ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్, దాన్ని ప్రమోట్ చేసేందుకు, రైతులను రక్షించేందుకు ప్రభుత్వం ఆలోచించాలన్నారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచారన్నారు. పెట్రోల, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించేందుకు ప్రయత్నించాలన్నారు. ఏపీ పునర్ విభజనం చట్టం ప్రకారం రావాల్సిన ప్రాజెక్టులు, ఫండ్స్ రావాలన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. తెలంగాణలో మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. సిరిసిల్లాలో మెగా పవర్లూమ్ పార్క్ను ఏర్పాటు చేయాలన్నారు. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని అభ్యర్థించారు. కొచ్చిన్, చెన్నై, బెంగుళూరు, నాగపూర్ పట్టణాలకు మెట్రో రైల్వే నిధులు కేటాయించారని, హైదరాబాద్ లో కూడా సెకండ్ ఫేస్ కోసం నిధులు ఇవ్వాంటూ ఎంపీ నామా కోరారు.
సైనిక్ స్కూళ్లు, ఏకలవ్య స్కూళ్లను తెలంగాణకు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ నుంచి చాలా మొత్తంలో కేంద్రానికి ఆదాయం వస్తోందని, దాంట్లో మెజారిటీ షేర్ రాష్ట్రానికి ఇవ్వాలన్నారు. పవర్ సప్లయ్లో తెలంగాణ నెంబర్ వన్ అన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. ఐటీ ఎగుమతుల్లో 17 శాతం హైదరాబాద్ నుంచి జరుగుతోందన్నారు. వంద శాతం మందికి డ్రింకింగ్ వాటర్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర మంత్రులు మెచ్చుకున్నారని, తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో ఇది సాధ్యమైందన్నారు. డెవలపింగ్ స్టేట్కు సపోర్ట్ కావాలి. డివల్యూషన్ కింద 5000 కోట్లు ఇవ్వాలని ఎంపీ నామా కేంద్రాన్ని కోరారు. జీఎస్టీ పెండింగ్ నిధులను కూడా ఇవ్వాలన్నారు.