రైతులకు వరం ధరణి: వేముల
ధరణి పోర్టల్ రైతులకు వర మని, దానిలో ఇంకా మాడ్యూల్స్ రావా ల్సి ఉన్నదని, వాటిని త్వరలోనే జత చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పా రు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ సిబ్బంది మొత్తం 2.48 కోట్ల ఎకరాల భూ రికార్డులను పరిశీలించారని చెప్పారు. వంద శాతం పారదర్శకతతో భూ లావాదేవీలు సాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
మహిళాభివృద్ధికి కృషి: సత్యవతి
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నదని మహి ళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ఆరోగ్యలక్ష్మి పథకానికి రూ.278 కోట్లు కేటాయించిందని చెప్పా రు. లాక్డౌన్ సమయంలో అంగన్వాడీ కేంద్రాల సేవలు ఆగిపోవద్దన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొండలు, గుట్టల్లో ఉన్న ఇండ్లకు సైతం సరుకులను చేర్చామని గుర్తుచేశారు. ఈ సేవలకు కేంద్రం అవార్డులను అందించిందని, ఇది ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
కల్లుగీత వృత్తికి జీవం: శ్రీనివాస్గౌడ్
గత పాలకుల హయాంలో నిర్వీర్యమైన కల్లుగీత వృత్తికి జీవంపోసి ఆదుకున్నది సీఎం కేసీఆర్ అని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. గీత వనాలను ఏర్పాటుచేయడమే కాకుం డా నీరా పాలసీ ద్వారా కల్లుగీత కార్మికులను ఆదుకుంటున్నట్టు చెప్పారు. చెట్టుపన్ను రద్దు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. నీరాకేఫ్లను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు.
ఆరేండ్లలోనే రాష్ట్రం అన్నపూర్ణ: నిరంజన్రెడ్డి
ఆరేండ్లలో రాష్ట్రం అన్నపూర్ణగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి చెప్పారు. 1.19 కోట్ల మెట్రిక్టన్నులు ఎఫ్సీఐ సేకరిస్తే అందులో 54 శాతం తెలంగాణ నుంచే సేకరించిందని తెలిపారు. యాసంగి వరిసాగులో దేశంలోనే మొదటిస్థానంలో తెలంగాణ ఉన్నదని చెప్పారు. 60.54 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేస్తూ దేశంలో రెండోస్థానంలో, నాణ్యతలో తొలిస్థానంలో రాష్ట్రం నిలిచిందని చెప్పారు.
ఆర్టీసీని ఆదుకున్నాం : పువ్వాడ అజయ్
అప్పుల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకున్నా మని, కరోనా లాక్డౌన్ సమయంలో వా హనాలకు రూ.267 కోట్ల పన్ను మాఫీ చేశామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు 100 శాతం ఫీజులు, పన్నులు మాఫీ చేశామని, లాక్డౌన్లో ఆర్టీసీ రూ. 2,200 కోట్ల ఆదాయం కోల్పోయిందని, డీజిల్ రేట్లు పెరిగి నెలకు రూ.30 కోట్ల భారం పడుతున్నదని చెప్పారు.
శాంతిభద్రతల్లో టాప్: మహమూద్అలీ
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్వన్గా ఉన్నారని హోంమంత్రి మహమూద్అలీ తెలిపారు. నేర నియంత్రణ, టెక్నాలజీ వినియోగంలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శం గా నిలుస్తున్నారని చెప్పారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో నిఘా పెరిగిందని చెప్పారు. సంచలనాత్మక కేసుల్లోనూ 24 గంటల నుంచి 48 గంటల్లోనే దర్యాప్తు పూర్తిచేసి నిందితులను అరెస్టు చేసిన ఘటన ఉన్నాయని అన్నారు. హైదరాబాద్లో ఇటీవల జరిగిన అన్ని హత్యలకూ కుటుంబ తగాదాలే కారణమని పేర్కొన్నారు.