నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో తగ్గిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 8,500 క్యూసెక్కులకు ఇన్ఫ్లో వస్తుందని వివరించారు. దీంతో ప్రాజెక్టు వరద గేట్లను మూసివేశామన్నారు.
ఎస్కేప్గేట్లతో 7500 క్యూసెక్కుల మిగులుజలాలను దిగువ గోదావరిలోకి, సరస్వతీ కాలువకు 800, లక్ష్మీ కాలువకు 80 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి అంతేస్థాయిలో ఉందని ఏఈఈ తెలిపారు.