అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు కేసు విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.
జగన్ బెయిల్ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పిటిషన్ అర్హతపై కోర్టులో వాదనలు జరిగాయి.. తర్వాత కోర్టు విచారణకు స్వీకరించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.