జోగులాంబ గద్వాల గద్వాల : కరోనా బారిన పడి జిల్లా దవాఖానాలో చికిత్స పొంది కరోనాను జయించి దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తి కరోనా రోగుల కోసం హాట్ వాటర్ మిషన్ అందజేశాడు. మంగళవారం జేసీ రఘురామ శర్మ చేతుల మీదుగా జిల్లా వైద్యాధికారి చందు నాయక్కు అందజేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. కేటీ దొడ్డి మండలం పాగుంట గ్రామానికి చెందిన సోమశేఖర్ రెడ్డి కరోనా బారిన పడి ఈ నెల రెండో తేదీన జిల్లా దవాఖాన లోని కరోనా వార్డులో చేరాడు. వైద్యులు సిబ్బంది అందించిన సేవలతో కరోనా నుంచి కోలుకొని సోమవారం ఇంటికి వెళ్లాడు.
వైద్యులు అందించిన సేవలకు గుర్తుగా దవాఖానకు సహాయం చేయాలనుకుని కరోనా రోగుల కోసం హాట్ వాటర్ మిషన్ను తన కుమారుడి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. కరోనా రోగులకు చికిత్స అందించడంలో గద్వాల దవాఖాన డాక్టర్లు వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆర్ ఎం వృషాలి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు