వెల్దుర్తి, మే 27: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివార్లలో జమున హ్యాచరీస్ పరిశ్రమ భూ కబ్జాలపై గురువారం సంబంధిత రైతులను విజిలెన్స్, ఏసీబీ అధికారులు విచారించారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులకు లిఖిత పూర్వకంగా సమాధాన పత్రాలను అందజేసిన రైతులను ఒక్కొక్కరిగా మాసాయిపేట తాసిల్దార్ కార్యాలయానికి పిలిపించి విచారించి, వాంగ్మూలాలను నమోదుచేశారు. విచారణలో పరిశ్రమకు భూములను విక్రయించారా? లేక పరిశ్రమవారు కబ్జా చేశారా? ఎప్పుడు జరిగింది? ఎవరు చేశారు? ఎంత భూమి కబ్జాకు గురైంది? కబ్జా చేస్తే ఎవరికైనా ఫిర్యాదు చేశారా? వంటి వివరాలను సేకరించి నమోదుచేశారు.