అశ్వారావుపేట, జూన్ 2 : ఆయిల్ఫెడ్ అధికారులు రైతులకు తీపికబురు చెప్పారు. ఆయిల్ రికవరీ ఆధారంగా గెలల ధరలను నెలనెల సవరిస్తున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో సమావేశమైన అధికారులు కొత్త ధరలు నిర్ణయించారు. గత నెలతో పోల్చితే జూన్లో గెలల ధర టన్నుకు రూ.730 ఎక్కువగా ప్రకటించారు. మేలో టన్ను ధర రూ.18,384 చెల్లించారు. కాగా, జనవరిలో టన్ను ధర రూ.14,415 ఉన్న ధర ప్రస్తుతం రూ. 19,114లకు చేరడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.