తెలుగు ఇండస్ట్రీలో చేయడానికి ఎప్పుడూ ముందుండే హీరో నాగార్జున. అలాగే ఇమేజ్ గురించి అస్సలు పట్టించుకోరు. కథ బాగుంటే మల్టీస్టారర్లో నటించడానికి వెనకాడడు. చిన్న హీరో పెద్ద హీరో అని చూడడు. తన పాత్ర నచ్చితే చాలు అందులో నటిస్తాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పుడు కూడా శ్రీకాంత్, మోహన్ బాబు లాంటి హీరోల సినిమాల్లో అతిథి పాత్రలు చేశాడు నాగార్జున. ఇదిలా ఉంటే ఇప్పుడు తన కొడుకుతో కలిసి ఓ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు నాగార్జున.
ఇప్పటికే పెద్ద కొడుకు నాగచైతన్యతో కలిసి మనం సినిమాలో నటించాడు ఈయన. ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే దృశ్య కావ్యంగా మిగిలిపోయింది. విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించిన మనం సినిమాలో అక్కినేని కుటుంబం అంతా కలిసి నటించింది. లెజండరీ నటుడు నాగేశ్వరరావు చివరి సినిమా ఇది. ఈ సినిమా చివరలో అఖిల్ గెస్ట్ రోల్ చేశాడు. అమల కూడా కొన్ని సెకన్ల పాటు కనిపించింది. మనం లాంటి సినిమా చేసుంటే బాగుండు అని చాలా మంది హీరోలు కలలు కన్నారు. అప్పుడు నాగచైతన్యతో కలిసి మనం సినిమాలో నటించిన నాగార్జున.. ఇప్పుడు అఖిల్ తో కలిసి నటించబోతున్నాడు.
ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఖరారు చేశాడు. తాను చిన్న కొడుకుతో కలిసి నటించబోతున్నట్లు చెప్పాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు చెబుతానని మీడియా ముందు ప్రకటించాడు నాగార్జున. దర్శకుడి వివరాలు ఇంకా చెప్పలేదు కానీ ఈ సినిమాకు కథ సిద్ధమవుతుందని మాత్రం క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు అఖిల్. దీని తర్వాత నాగార్జున, అఖిల్ మల్టీస్టారర్ ఉండే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్లో స్టిల్
పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు.. . ‘వకీల్ సాబ్’ ఓటిటి డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
వకీల్ సాబ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందా?
కరోనాతో సీనియర్ నటి భర్త మృతి
అఫీషియల్: ఆచార్య చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన నిర్మాణ సంస్థ
మూడో హిందీ చిత్రానికి రష్మిక గ్రీన్ సిగ్నల్..!