మల్యాల, జూన్ 4 : జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో కొండగట్టు అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖండ హనుమాన్చాలీసా పారాయణ పఠనం ముగిసింది. రెండు మండలాలలపాటు ఇది కొనసాగింది. శుక్రవారం మల్యాలకు చెందిన మఠమాంజనేయ స్వామి ఆలయ భజన బృందం సభ్యులతోపాటు కరీంనగర్కు చెందిన గాయకుడు శ్రీనివాస్ కలిసి హనుమాన్చాలీసా పారాయణాన్ని 11 సార్లు కొనసాగించారు. ఆలయ స్థానాచార్యులు జితేంద్రప్రసాద్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఆలయ ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, వేద పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య అభిషేకం, హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. హనుమాన్చాలీసా పారాయణం నిర్వహించిన అర్చకులు, భజనమండలి సభ్యులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, దీవెన దంపతులు తదితరులు పాల్గొన్నారు.