ములుగు : అక్రమంగా నిల్వ చేసిన 232 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..జిల్లాలోని ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామ పంచాయతి పరిధిలోని హనుమాన్ నగర్లో మోతె సమ్మయ్య ఇంట్లో బియ్యం నిల్వ ఉంచాడనే విశ్వసనీయ సమాచారం మేరకు.. రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 232 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోదాంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.