వరంగల్, ఆగస్టు 8: మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తెలంగాణ సర్కారు కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో తలపెట్టిన భవన నిర్మాణానికి ఈ మొత్తం ఇవ్వనున్నట్టు ఆదివారం హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో జరిగిన మున్నూరుకాపు సంక్షేమ సంఘం సమావేశంలో రవిచంద్ర వెల్లడించారు. కోటి విరాళం ప్రకటించిన వద్దిరాజు రవిచంద్రను టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కే కేశవరావు. మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు.