హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మత్తు (అనస్థీషియా) వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ కే రత్నాకర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఎం రామకృష్ణారెడ్డి ఎన్నికైనట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రత్నాకర్ కరీంనగర్లో అనస్థీషియా స్పెషలిస్టుగా, రామకృష్ణారెడ్డి హైదరాబాద్లోని మెడిసిటీ మెడికల్ కాలేజీలో అనస్థీషియా ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.