హైదరాబాద్ : అకడమిక్ ఇయర్ 2021-22కు చెందిన 9 నుంచి 12 తరగతుల సిలబస్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్( CBSE ) గురువారం విడుదల చేసింది. నూతన విద్యాసంవత్సరం ఏప్రిల్ నుండి ప్రారంభం అవుతుంది. కాగా ఈసారి సిలబస్లో ఎలాంటి తగ్గింపులు లేవని సీబీఎస్ఈ తెలిపింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో గతేడాది విద్యాసంవత్సరంలో సీబీఎస్ఈ 30 శాతం సిలబస్ను తగ్గించిన సంగతి తెలిసిందే. గతేడాది తగ్గించిన సిలబస్ తాజాగా వర్తించదన్న విషయాన్ని విద్యార్థులు గమనించాల్సిందిగా పేర్కొంది. ఈ ఏడాది పూర్తి సిలబస్ను చదవాలంది.
10, 12వ తరగతుల పరీక్షలను సీబీఎస్ఈ ఇటీవలే సవరించింది. మే 13న జరగాల్సిన 12వ తరగతి ఫిజిక్స్ పేపర్, ఐప్లెడ్ ఫిజిక్స్ను జూన్ 1వ తేదీకి మార్పు చేసింది. అదేవిధంగా మే 21న జరగాల్సిన 10వ తరగతి మ్యాథమెటిక్స్ పేపర్ను జూన్ 2వ తేదీకి మార్చింది. ఇదే విధంగా ఇతర సబ్జెక్టులను కూడా మార్చింది. మే 4 నుంచి జూన్ 1 వరకు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహణ. 9 నుంచి 12వ తరగతి అభ్యర్థులు వెబ్సైట్ cbseacademic.nic.in. నుంచి సిలబస్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించింది.