మహబూబ్నగర్ : ఆర్థికంగా ఉన్నవాళ్లు స్వచ్ఛందంగా రేషన్ కార్డులు వదులుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజాపూర్ మండల రైతు బంధు అధ్యక్షుడు నర్సింలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, ప్రధాన కార్యదర్శి నరహరి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరక్టర్ దేవేందర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ స్వచ్ఛందంగా రేషన్ కార్డులు వదులుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రేషన్ కార్డులు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయడంతో అర్హులైన పేదలకు మరింతగా రేషన్ కార్డులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. సామాజిక బాధ్యతగా భావించి మరింత మంది ముందుకు రావాలన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జులుం
ఛత్తీస్గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పిల్లలతో కలిసి ఈత కొట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
గంభీర్కు చుక్కెదురు.. స్టే ఇవ్వలేమన్న సుప్రీం