కాటారం, ఆగస్టు 23: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్న సామెతకు మన శ్రీనిత సరిగ్గా సరిపోతుంది. అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న బెంగళూరుకు చెం దిన నాలుగేళ్ల పాపనే శ్రీనిత. ఈ చిన్నారి తెలంగాణ బిడ్డనే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారానికి చెందిన పులి సత్యనారాయణ, అర్చన దంపతుల కుమార్తెనే శ్రీనిత. ఉద్యోగ రీత్యా బెంగళూరులోని బీహెచ్ఈఎల్లో మేనేజర్గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు సత్యనారాయణ. నాలుగేళ్ల ప్రాయంలోనే ఆ చిన్నారి గత జూలై 15 మొదట 53 సెకన్లలో ఆవర్తన పట్టికలోని 118 మూలకాల పేర్లను వేగంగా పఠించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. అనంతరం తన రికార్డునే తానే బ్రేక్ చేసింది. జూలై 16న 49 సెకన్లలో వాటిని పఠించి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకున్నది. అదేరోజు ఇంటర్నేషనల్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం వరల్డ్ రికార్డ్స్ల్లో చోటు సంపాదించింది. ఆ శ్రీనిత తల్లిదండ్రులది స్వగ్రామం కాటారం కావడంతో స్థానికులు సంబురపడ్డారు.