ఆల్ ఆన్ ఫోర్ విధానం ద్వారా 28 దంతాలు అమర్చిన వైద్యులు
జగిత్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 15: జగిత్యాలలోని ఆర్కే దంత వైద్యశాలలో అరుదైన ఆపరేషన్ చేసి 28 దంతాలు అమర్చారు. గురువారం దవాఖానలో డాక్టర్ కేశవ్ మీడియాతో మాట్లాడుతూ శస్త్ర చికిత్స వివరాలు వెల్లడించారు. రాయికల్ మండ లం ఒడ్డెలింగాపూర్కు చెందిన 48 ఏండ్ల వ్యక్తికి నోటిలో ఎముకలు తక్కువగా ఉండటంతో దంతాలు పూర్తిగా ఊడిపోయాయని, లక్షల్లో ఒకరు ఇలాంటి వ్యాధితో బాధపడుతారని ఆయన పేర్కొన్నారు. బాధితుడు ఇటీవల తమను సంప్రదించగా, సమస్యను హైదరాబాద్కు చెందిన ప్రముఖ దంత శస్త్ర చికిత్స నిపుణుడు ఆకాశ్ చక్రవర్తి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. డాక్టర్ ఆకాశ్ చక్రవర్తి జగిత్యాలకు వచ్చి గురువారం బాధితుడికి ఆల్ ఆన్ ఫోర్ విధానం ద్వారా నాలుగు గంటలు శ్రమించి నోటిలో 28 దంతాలు అమర్చారని డాక్టర్ కేశవ్ వివరించారు.