మహబూబ్నగర్ : సేవకు, మానవత్వానికి వారు ప్రతీక. నిస్వార్థ సేవ చేస్తూ ప్రతి రోగిని సొంతవారిలా చూసుకొని కోలుకునేలా చేసే నర్సులందరికి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
తల్లికి మరో రూపమే నర్సుగా మంత్రి అభివర్ణించారు.
రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో..నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యమన్నారు. నర్సు వృత్తికి మార్గదర్శనమైన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854 లో క్రిమియా యుద్ధంలో టర్కీ లో గాయపడిన సైనికులకు చేసిన సేవకు గుర్తుగా ఆమె జన్మదినమైన మే – 12 ను పురస్కరించుకుని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం గా జరుపుతున్నారన్నారని మంత్రి తెలిపారు. కరోనా వేళ తమ ప్రాణాలను పణంగా పెట్టి నర్సులు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
లాక్ డౌన్ అమలును పరిశీలించిన మంత్రి ఐకే రెడ్డి
నర్సుల త్యాగం మానవీయమైనది : సీఎం కేసీఆర్
తెలంగాణ లాక్డౌన్.. యథావిధిగా బ్యాంకులు, ఏటీఎంలు