ఎన్ఏక్యూఎస్ ర్యాంకింగ్లో రెండు, మూడు స్థానాల్లో జనగామ, జగిత్యాల జిల్లా హాస్పిటల్స్
కొండాపూర్, మే 30 : రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాల్లో రంగారెడ్డి జిల్లా దవాఖాన మేటిగా నిలిచింది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం విడుదల చేసిన ‘నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్’లో రాష్ట్రంలోని ప్రభుత్వ హెల్త్ ఫెసిలిటీస్ 91.4 శాతంతో ప్రథమ స్థానం సాధించిన్నట్టు దవాఖాన సూపరిండెంట్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్ఏక్యూఎస్ సర్టిఫికేషన్లో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా దవాఖానకు ప్రతి సంవత్సరం రూ.20 లక్షల వరకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందనున్నట్టు పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది పరస్పర సహకారంతోనే దవాఖాన ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. కాయకల్ప సర్టిఫికేషన్లోనూ మెరుగైన ర్యాంకును సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు, మూడు స్థానాల్లో జనగామ, జగిత్యాల జిల్లా దవాఖానలు నిలిచినట్టు తెలిపారు.