కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ సరిపల్లి దర్శకుడు. 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. శక్తివంతంగా ఆయన పాత్ర సాగుతుంది. సుధాకర్ కొమాకుల ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. తమిళ నాయిక తాన్యా రవిచంద్రన్ ఈ సినిమా ద్వారా తెలుగులో అరంగేట్రం చేస్తోంది’ అని తెలిపారు. ‘ఈ నెలాఖరు వరకు హైదరాబాద్లో జరిగే షెడ్యూల్తో 90 శాతం చిత్రీకరణ పూర్తవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, ఛాయాగ్రహణం: పీసీ మౌళి.