సంయుక్తంగా ప్రారంభించిన ఎస్బీఐ, ఎన్సీపీఐ
న్యూఢిల్లీ, మార్చి 5: వ్యాపారుల సౌలభ్యం కోసం ఎస్బీఐ పేమెంట్స్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) కలిసి రూపే సాఫ్ట్ పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో వ్యాపారులు తమ స్మార్ట్ఫోన్ల ద్వారా కాంటాక్ట్లెస్ పద్ధతిలో రూ.5 వేల వరకు విలువైన లావాదేవీలను నిర్వహించుకునేందుకు వీలవుతుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) ఫీచర్ కలిగిన స్మార్ట్ఫోన్లను మర్చంట్ పీఓఎస్ టెర్మినళ్లగా మార్చగలిగే సామర్థ్యం దీనికి ఉంటుందని ఎస్బీఐ, ఎన్పీసీఐ శుక్రవారం ఓ సంయుక్త ప్రకటనలో వివరించాయి.