ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పోలీసులు స్థానికంగా ఉండే దవాఖాన ల్లోనే వైద్య సేవలు వినియోగించుకోవచ్చని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన పోలీసుల డైరీని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి గురువారం విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసుల ఆరోగ్య భద్రత కో సం ఉచితంగా కార్పొరేట్ వైద్య సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా పోలీసులకు అత్యవసర వైద్య సేవల్లో వైద్య సహాయం పొందడానికి హైదరాబాద్ వెళ్లక తప్పని పరిస్థితి నెలకొన్నదన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యను అదిగమించడానికి శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, నిర్మల్ జిల్లా ఆదిత్య నర్సింగ్హోం హాస్పిటల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డికి నివేదిక సమర్పించామన్నారు. జిల్లా పోలీసులకు వైద్య సహాయం అందించడానికి రెండు దవాఖాన లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సుమారు 2వేల మంది పోలీసుల కుటుంబ సభ్యులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనిపై ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పోలీసులు హర్షం వ్యక్తం చే స్తూ ఎస్పీకి కృతజ్ఞతలు తలిపారు. కార్యక్రమంలో పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, స్ఫెషల్బ్రాంచ్ ఎస్ఐ అన్వర్ ఉల్హక్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్కే తాజుద్దీన్, కార్యవర్గ సభ్యులు అడెల్లు, చిందం దేవీదాస్, డాక్టర్ సీ ఆర్ గంగారం ఉన్నారు.