హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజును పురస్కరించుకుని రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఆయన కేటీఆర్ను నవతరం నాయకుడిగా అభివర్ణించారు. ‘అరుదైన నాయకత్వం లక్షణాలు, అసాధారణ సంభాషణానైపుణ్యం, అన్నింటికి మించిన రాజకీయ చతురతతో అనతికాలంలో పరిణతి గల నాయకుడిగా ఎదిగి తెలంగాణ రాజకీయ యవనికపై వెలుగులీనుతున్న మీకు 45 వ పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆశీస్సులు’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతింతై మీరు దేశానికి నాయకత్వం వహించే ధృవతార(క రాముని)గా ఎదగాలని రామోజీరావు ఆకాంక్షించారు.