హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్రం గ్రేడ్-2 ర్యాంకును సొంతం చేసుకున్నది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, పాఠశాలల నిర్వహణలో ఉత్తమ ప్రదర్శనను కనబరిచింది. ఈ విషయాన్ని పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) ద్వారా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019- 20 సంవత్సరానికి పీజీఐ గ్రేడ్లను కేంద్రం విడుదలచేయగా, తెలంగాణ 2018-19 కంటే స్కోర్ను మెరుగుపరుచుకోవడం విశేషం. 2018-19లో 757 పాయింట్లు పొందగా, 2019- 20లో 772 పాయింట్లు పొందడం గమనార్హం. తెలంగాణ గతంలోనే గ్రేడ్-2 ర్యాంకును సొంతంచేసుకోగా, తాజా పీజీఐ ఇండెక్స్లోనూ అదే ర్యాంకు పొందింది. మూడు క్యాటగిరీల్లో 70 అంశాల ఆధారంగా కేంద్ర విద్యాశాఖ మూడేండ్లుగా రాష్ర్టాలకు ఈ ర్యాంకులను కేటాయిస్తున్నది.
రాష్ట్రం పొందిన పాయింట్లు ఇలా..