రామన్నపేట: దేశంలోని అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ పాలన చిరునామా అని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్ ఫంక్షన్హాల్లో జరిగిన టీఆర్ఎస్ మండల కమిటీల అనుబంధ కమిటీల పరిచయ వేదిక, బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ముక్కు నేలకు రాసి మోకాళ్ల యాత్రలు చేసిన వారి మాటలను ప్రజలు నమ్మరని ఆయన తెలిపారు.
మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు భీమా ఆసరా పెన్షన్ల వంటి పథకాలు అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకంటే ఎక్కువ సంక్షేమ పథకాలను అమ లు చేసిందన్నారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి వేల మంది కేసీఆర్ నీడలో మంచిగా బ్రతుకుదాం అని హైదరాబాద్కు వలస వస్తున్నారని అన్నారు.
కేసీఆర్ గాలి కోటికి కూడా సరిపోని ప్రతిపక్ష నాయకులు ఎగిరిఎగిరి మొరుగుతున్నారని చూస్తూ వారిని ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆంధ్ర పాలకులు దోచుకోవడానికి, దాచుకోవడానికి పనిచేశాయి తప్పా అభివృద్ధికి కృషి చేయ లేదన్నారు. గులాబీ జెండా కప్పుకునే అదృష్టం రావడం గొప్ప వరమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బ్యాలెట్ రూపంలో కారుగుర్తుపై ఓట్లు వేసే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తకెళ్లపల్లి రవీంద ర్రావు మాట్లాడుతూ… ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని అన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. 60లక్షల సభ్యత్వాలతో భారతదేశంలోనే శక్తివంతమై న పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయన్నారు. ఈ సందర్భంగా మం డల కేంద్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ జెండాను ఎగురవేసి కార్యకర్తలు నిర్వహించిన బైక్ర్యాలీలో పాల్గొన్నారు.
నూతన అధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డిని, ప్రధాన కార్యదర్శి పోచబోయిన మల్లేశ్ను భారీ గజమాలతో ఘనంగా సన్మా నించారు. నంద్యాల భిక్షం రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, జడ్పీటీసీ పున్న లక్ష్మి, నాయకులు గంగుల కృష్ణారెడ్డి, మందడి రవీందర్రెడ్డి, కన్నెబోయిన అయిలయ్య, గుత్తా నర్సిరెడ్డి, తిమ్మాపురం మహేం దర్రెడ్డి, బందెల రాములు, కమ్మంపాటి శ్రీనివాస్, అంతటి రమేశ్, మందడి శ్రీధర్ రెడ్డి, పోతరాజు సాయి కుమార్ ఆయా గ్రామాల సర్పంచ్లు ఎడ్ల మహేందర్రెడ్డి, అప్పం లక్ష్మినర్సు, రేఖ యాదయ్య, మెట్టు మహేందర్రెడ్డి, పిట్ట కృష్ణరెడ్డి, కోళ్ల స్వామి, చెరుకు సోమయ్య, ముత్యాల సుజాత, బందెల యాదయ్య, కడమంచి సంధ్య, ఎంపీటీసీలు గొరిగే నర్సింహా, ఎండీ రేహాన్, గాదే పారిజాత, దోమల సతీశ్, కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఆమేర్ తదితరులు పాల్గొన్నారు.